KTR: సిరిసిల్ల‌కు మంచి రోజులు.. అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి

KTR laid foundation stone for Gokaldas Images Apparel Factory at Sircilla Apparel Park
x

KTR: సిరిసిల్ల‌కు మంచి రోజులు.. అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి

Highlights

KTR: సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని అన్నారు మంత్రి కేటీఆర్.

KTR: సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయని అన్నారు మంత్రి కేటీఆర్. పెద్దూరు అపారల్‌ పార్కులో గోకుల్‌దాస్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి అపారల్‌ పార్క్‌ ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఎపట్నుంచో కల కంటున్నారని అన్నారు. 2005లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అపారల్‌ పార్క్‌ పెడతామని మాట ఇచ్చి తప్పారని ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో దానికి బీజం పడిందన్నారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా రాబోయే రోజుల్లో 10వేల మంది ఉపాధి పొందబోతున్నారని, వారిలో 80 శాతానికిపైగా అవకాశాలు మహిళలకే లభిస్తాయన్నారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories