KTR: దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 4:45 PM IST
KTR: దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే
X

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసి.. జిల్లాలో అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తానన్నారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చి అందరిని మోసం చేసిందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తానని.. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. మార్పు మార్పు అంటూ రెండేళ్లలో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో అందరికి అర్థమయిందని కేటీఆర్ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story