సహాయక చర్యలను వేగవంతం చేయాలి : కేటీఆర్

సహాయక చర్యలను వేగవంతం చేయాలి : కేటీఆర్
x
Highlights

నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఓ వైపు ఆస్తి నష్టం, మరో వైపు ప్రాణ నష్టం కూడా...

నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణ ప్రజలు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ఓ వైపు ఆస్తి నష్టం, మరో వైపు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో మంత్రి కేటీ రామారావు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా భాగ్యనగరంలో రెండు నిండు ప్రాణాలు పోయిన ఘటన తెలుగు ప్రజలను ఎంతగానో కలచివేసిందన్నారు. వచ్చే రెండు వారాల పాటు జీహెచ్చ్ఎంసీ సిబ్బందికి సెలవు రద్దు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

ఓపెన్ నాలాలపై రక్షణ వలయాల నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ తక్షణం పనులు ప్రారంభిస్తుందని చెప్పారు. దీని కోసం రూ.300 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. రహదారి మరమ్మతు పనులను చేపట్టాలని, వర్షాలు తగ్గినప్పుడు శానిటైజేషన్ పనులను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. శిధిల స్థితిలో ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. 2 మీటర్లు, అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న నాలాలపై పైకప్పు ఏర్పాటు చేయాలని అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పక్కా ప్రణాళికతో సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న నాలాలకు ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి 170 బృందాలు, నీటితో నిండిన ప్రదేశాలను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించాలని మంత్రి అధికారులను కోరారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని వివిధ ప్రాజెక్టులలో భాగంగా తవ్విన ఫెన్సింగ్‌తో గుంటలను కప్పడం సహా నిర్మాణ స్థలాల వద్ద ప్రైవేటు కాంట్రాక్టర్లకు వివిధ భద్రతా చర్యలు తీసుకోవడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్ & ఎస్బి) అధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories