యువత సహాయక చర్యలు చేపట్టాలి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

యువత సహాయక చర్యలు చేపట్టాలి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
x
Highlights

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఊహించని స్థాయిలో వర్షాలు పడ్డాయని, వరదల కారణంగా నగరాల్లోని ఎంతో మంది గల్లంతయ్యారని, లోతట్టు...

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఊహించని స్థాయిలో వర్షాలు పడ్డాయని, వరదల కారణంగా నగరాల్లోని ఎంతో మంది గల్లంతయ్యారని, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ఇండ్లన్నీ మునిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నగరాల్లోని ప్రజలు అవసరమైతే తప్పించి బయటికి రావొద్దని, ముఖ్యంగా వరద ప్రాంతాల్లో వాహనాలపైన ప్రజలెవరూ తిరగకూడదని ఆయన కోరారు. రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్న క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాతావరణ శాఖ కూడా ముందునుంచి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో రెండు రోజుల్లోనే అత్యధిక వర్షపాతం నమోదయిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల గురించి స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నామని ఆయన అన్నారు.

సాధ్యమైనంత వరకు భారీ నష్టం వాటిల్లకుండా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, సహాయ పునరావాస ఏర్పాట్లు చేయాలని సూచించానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని నిన్ననే అందుబాటులో పెట్టామని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకత్వం, శ్రేణులతో మాట్లాడి నిర్వాసితులకు భోజనం అందించడం సహా ఇతర సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరాను. మరో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటి రాష్ట్రాల నుంచి హైదరాబాద్ చేరుకున్నాయని ఆయన స్పస్టం చేసారు. యువత కూడా అధికార యంత్రాంగంపై ఆధారపడకుండా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నానన్నారు. బీజేపీ శ్రేణులు విస్తృతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories