Telangana: నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం.. హాజరుకానున్న తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌

Key Meeting of Telangana BJP Leaders today
x

Telangana: నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం.. హాజరుకానున్న తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌

Highlights

Telangana: హాజరుకానున్న తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌

Telangana: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో... కమలం పార్టీ గెలుపు వ్యూహాలు రచిస్తుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్‌ఎస్‌పై కాకుండా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా దృష్టి సారించింది బీజేపీ. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ టార్గెట్‌‌గా తెలంగాణ ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌ ఇవాళ తెలంగాణకు రానున్నారు.తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తెలంగాణలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్‌సభ ఎన్నికలు... రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు సీట్లు తగ్గించి, అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నాయి. విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ పాలన, అక్రమాలు వస్తాయని ఆరోపించారు. బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తామని ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెట్టింపు చేశారు. ఈసారి రెండంకెల ఎంపీ సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లైనా గెలవాలని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీని ఆదేశించింది. దీంతో పాటు మరో రెండు సీట్లు గెలుచుకునేందుకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories