CM KCR: ఎంపీ కొత్త ప్రభాకర్ ‌రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్

KCR To Visit MP Prabhakar Reddy
x

CM KCR: ఎంపీ కొత్త ప్రభాకర్ ‌రెడ్డిని పరామర్శించనున్న కేసీఆర్

Highlights

CM KCR: కడుపులో రక్తస్రావం అయినట్లు స్కానింగ్‌లో గుర్తింపు

CM KCR: కాసేపట్లో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. సిద్దిపేట జిల్లాలో కత్తి దాడిలో గాయపడిన ఎంపీ కొత్త ప్రభాకర్ ‌రెడ్డిని పరామర్శించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయనకు కడుపుపై కుడి భాగంలో మూడు అంగుళాల లోతు గాయమైంది. గజ్వేల్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను సికింద్రాబాద్ యశోదకు తరలించగా.. ప్రస్తుతం యశోద హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు సర్జరీ చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితిని ఆరా తీసిన సీఎం కేసీఆర్.. బాన్సువాడు, నారాయణఖేడ్‌లో ప్రజా ఆశీర్వాద సభలను త్వరగా ముగించి హైదరాబాద్ ప్రయాణమయ్యారు.

యశోదలో చికిత్స పొందుతోన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన ఆయన.. హత్యాయత్నాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కుట్ర దాగుందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. కత్తిపోటుతో ప్రభాకర్ రెడ్డి కడుపులో గాయాలయ్యాయని... ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు, కేడర్ ఆందోళన చెందొద్దన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories