KCR SIT Notice News: సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ కీలక భేటీ!

KCR SIT Notice News: సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ కీలక భేటీ!
x
Highlights

KCR SIT Notice News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుకు సిట్ (SIT) రెండోసారి నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

KCR SIT Notice News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుకు సిట్ (SIT) రెండోసారి నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో కలిసి కేసీఆర్ సుదీర్ఘంగా సమాలోచనలు జరుపుతున్నారు.

న్యాయ నిపుణుల సలహా.. విచారణకు వెళ్తారా?

సిట్ నోటీసులపై ఎలా స్పందించాలనే అంశంపై కేసీఆర్ సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో విచారణ జరపాలన్న కేసీఆర్ ప్రతిపాదనను సిట్ అధికారులు తోసిపుచ్చడంతో.. నేరుగా విచారణకు హాజరు కావాలా? లేక న్యాయపరంగా స్టే కోరాలా? అనే అంశంపై సమాలోచనలు సాగుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే, రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది.

కీలక పరిణామాలు:

రెండోసారి నోటీసులు: విచారణకు హాజరుకావాలని రాత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు రెండోసారి నోటీసులు అందజేశారు.

నేతల భేటీ: ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు భారీగా చేరుకోనున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు.

నందినగర్ వెళ్లాలా? వద్దా?: కేసీఆర్ తన నివాసం నందినగర్‌కు వెళ్లాలా లేక ఫామ్‌హౌస్ నుంచే ప్రకటన చేయాలా అనే అంశంపై నేతల అభిప్రాయం తీసుకోనున్నారు.

ఆందోళనలకు సిద్ధం: ఒకవేళ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.

మధ్యాహ్నానికి కేసీఆర్ నిర్ణయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అధిష్టానం ఇప్పటికే సంకేతాలిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories