ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొటుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలంతా తమ నాయకునికి వారి వారి విన్నపాలను చెవిలో వేస్తున్నారు. ఎవరు ఎన్ని...

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొటుంది. ఈ క్రమంలోనే పార్టీ నేతలంతా తమ నాయకునికి వారి వారి విన్నపాలను చెవిలో వేస్తున్నారు. ఎవరు ఎన్ని విన్నాలు విన్నవించినా సీఎం కేసీఆర్ మాత్రం ఈ సారి పొలిటికల్ రూట్ లో కాకుండా కాస్త ట్రాక్ మార్చారనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సారి టికెట్ ను పార్టీ నాయకులకు కాకుండా ఫక్తు తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

దేశపతి శ్రీనివాస్ ఈయన తెలంగాణ ఉద్యమంలో కదంతొక్కిన ప్రజాగాయకుడు. ఈయన ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన పేరు అభ్యర్ధుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. అంతే కాక తెలంగాణ మేధావిగా పేరుగాంచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కళాకారుడి కోటాలో ఈయనకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, నాగేశ్వర్ కు పోటీగా టీఆర్ఎస్ నుంచి పోటీకి నిలబెట్టకుండా, ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడే మర్రి రాజశేఖర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. ఆయనను బరిలోకి దించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో, ఇతర ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories