ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత
x
Highlights

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కవితతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత‌కు మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. ఉప పోరులో 672 ఓట్ల మెజార్టీతో కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభ సభ్యురాలిగా నిజామాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన కవిత తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో శాసనమండలిలో తన గళాన్ని వినిపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories