Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టుకు మరోసారి కేసీఆర్‌, హరీష్‌రావు

Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీమంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri
Published on: 3 Sept 2025 10:35 AM IST
Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టుకు మరోసారి కేసీఆర్‌, హరీష్‌రావు
X

Kaleshwaram Project Case: తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్‌, మాజీమంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎలాంటి విచారణ చేపట్టవద్దని.. వారు మళ్లీ మెన్షన్‌ చేయనున్నారు. ఇప్పటికే కాళేశ్వరంపై ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని టీజీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు రిటైర్డ్‌ సీఎస్‌ ఎస్కే జోషి. ప్రభుత్వం సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చిందని, లీగల్‌ నోటీసులు ఇవ్వలేదని రిటైర్డ్‌ సీఎస్‌ జోషి కోర్టుకు తెలిపారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story