TG High Court: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ
TG High Court: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
TG High Court: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎస్.కె. జోషి, స్మితా సబర్వాల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులను నవంబర్ 12 వరకు పొడిగించింది.
Next Story




