Kadiyam Srihari: అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను

Kadiyam Srihari: స్పీకర్ జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2025 12:31 PM IST
Kadiyam Srihari: అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను
X

Kadiyam Srihari: స్పీకర్ జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజలు తనను నమ్మి గెలిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

"ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నేను ప్రజలకు హామీ ఇచ్చాను. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో, నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని నేను భావించాను" అని కడియం శ్రీహరి అన్నారు.

అందుకే, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని తాను నమ్మినట్లు ఆయన వివరించారు. ఈ కారణంగానే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story