Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం ఊహించిందే

Arun Chilukuri
Published on: 14 Nov 2025 12:00 PM IST
Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం ఊహించిందే
X

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం తమ పార్టీ ముందే ఊహించిందేనని ఆయన పేర్కొన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, మహేష్ గౌడ్ ఒక ముఖ్యమైన అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. "జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవ్వడం బాధాకరం. ఓటింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు," అని ఆయన అన్నారు.

మహేష్ గౌడ్ ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనది అని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు ఆరోపణలు

ఈ ఎన్నికల్లో తమ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేసిన మహేష్ గౌడ్, ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

"జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ గెలుపు కోసం ప్రయత్నించింది," అని ఆయన ఆరోపించారు.

"మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది," అని ఆయన ధీమాగా చెప్పారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఈ విజయాన్ని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం ఇస్తామని ప్రకటించారు. కార్యకర్తల కృషి, పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story