కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు జేపీ నడ్డా

JP Nadda Will Reach Hyderabad Today
x

కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు జేపీ నడ్డా

Highlights

JP Nadda: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి నోవాటెల్‌ వరకు భారీ ర్యాలీ

JP Nadda: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు భాగ్యనగరానికి క్యూ కట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాట్లు చేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు కమలదళం ప్లాన్ చేస్తుంది. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి బీజేపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీగా తీసుకురానున్నారు. శంషాబాద్‌లో కిలోమీటర్ మేర రోడ్ షో ఉండనుంది.

ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు HICC గొల్లకొండ ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. సాయంత్రం 7 గంటలకు జాతీయ ప్రధాన కార్యద‌ర్శుల‌తో స‌మావేశం జరుగనుంది. ఇక రాత్రి 8గంటల 30 నిమిసాలకు భ‌ర‌త‌నాట్యం, శివ‌తాండ‌వం, పేరిణి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు నడ్డా. ఇదిలా ఉండగా జూలై 3న ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొననున్నారు.

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాలకు కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నగరంలో బీజేపీ జెండాలు, ఫ్లెక్సీల, కటౌట్లు, బోర్డులతో నింపేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికవుతోంది. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ నెల 3న జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకొని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని కూడా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది

Show Full Article
Print Article
Next Story
More Stories