క‌రోనాతో జ‌గిత్యాల అడిషనల్ ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి

క‌రోనాతో జ‌గిత్యాల అడిషనల్ ఎస్పీ ద‌క్షిణామూర్తి మృతి
x
Highlights

Jagtial Additional SP Dakshina Murthy died with coronavirus: కరోనా బారినపడిన జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి చెందారు. వారం...

Jagtial Additional SP Dakshina Murthy died with coronavirus: కరోనా బారినపడిన జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతి చెందారు. వారం రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దక్షిణామూర్తి స్వస్థలం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని అలుగునూరు. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా దక్షిణామూర్తి పోలీస్ శాఖలోకి వచ్చారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సీఐ, డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఇటీవల మేడారం జాతరకు స్పెషల్ ఆఫీసర్‌గా దక్షిణామూర్తి పనిచేశారు. కాగా మరో ఐదు రోజుల్లో పదవి విరమణ ఉండగా ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.

అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం

జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణ మూర్తి ఆకస్మిక మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయ‌న ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు. నిర్మల్ అడిషనల్ ఎస్పీగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో సుదీర్ఘంగా పని చేశారని ముఖ్యంగా మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories