తెలంగాణలో కరోనా తగ్గుమఖం పట్టిందా.. ప్రజల్లో మనోధైర్యం పెరిగిందా..?

తెలంగాణలో కరోనా తగ్గుమఖం పట్టిందా.. ప్రజల్లో మనోధైర్యం పెరిగిందా..?
x
Highlights

నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తెలంగాణలో తగ్గుముఖం పట్టిందా..? లేక ప్రజల్లో మనోదైర్యం పెరిగిందా..? రోజు రోజుకు కరోనా కేసులు...

నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తెలంగాణలో తగ్గుముఖం పట్టిందా..? లేక ప్రజల్లో మనోదైర్యం పెరిగిందా..? రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రుల్లో మాత్రం బెడ్స్ ఖాళీ అవ్వడం వెనుక మర్మం ఏమిటి..? తాజాగా కరోనా పాజిటీవ్ వచ్చిన వాళ్లంతా హోం ఐసోలేషన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా చికిత్స చేసే సాధారణ పడకల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేవలం ఆక్సిజన్, ఐసీయూ పడకలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గతంలో కరోనా పాజిటివ్‌ వస్తే చాలు బాధితులు ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రులకు వచ్చేవారు. లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ తేలితే ఆసుపత్రులకు వచ్చి సాధారణ పడకల్లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందేవారు.

ప్రస్తుతం సాధారణ లక్షణాలుంటే ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేవలం ఆక్సిజన్‌ లేదా ఐసీయూ అవసరమైన రోగులు మాత్రమే ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో కరోనా రోగుల సంఖ్య తగ్గుతోంది. ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ వైద్యశాలలోనూ సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులు ఆసుపత్రుల్లో బెడ్ల కోసం ఉరుకులు పరుగులు తీసిన జనం ఆసుపత్రుల వైపు కాకుండా ఇళ్లకే పరిమితం అవ్వడంతో ప్రభుత్వం వైద్యులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.

సూపర్‌ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రుల్లో చాలాచోట్ల కరోనా సాధారణ పడకలను ఎత్తేశాయి. వాటిని ఇతర వైద్య సేవలకు కొన్ని చోట్ల ఉపయోగిస్తుండగా, కొన్ని చోట్ల ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనాతో నిన్నటి మొన్నటి వరకు హైరాన పడిన జనం ఆ భయం నుంచి మెల్లి మెల్లిగా సాధరణ స్థితికి చేరుకుంటున్నారు. ప్రజల్లో కరోనా ఆందోళన పోతే చావుల సంఖ్య కూడ తగ్గుతుందనడానికి ఈ కొత్త లెక్కలే నిదర్శనంగా మరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories