ఫుడింగ్ పబ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిందితులను కస్టడీలోకి.. మరిన్ని విషయాలు వెలుగులోకి...

Investigation Going on Pudding and Mink Pub Drugs Case | Banjara Hills
x

ఫుడింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిందితులను కస్టడీలోకి.. మరిన్ని విషయాలు వెలుగులోకి...

Highlights

Pudding and Mink Pub Case: ఇప్పటికే కిరణ్ అనే నిర్వాహకుడు అమెరికాలో ఉన్నట్లు గుర్తింపు...

Pudding and Mink Pub Case: బంజారాహిల్స్ ఫుడింగ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు నిందితుల అభిషేక్, అనిల్‌ను నాలుగు రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీలోకి అనుమతించింది. ఈ నెల 14 నుండి 17 వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు. అలాగే నిందితుల బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఫుడింగ్ మింక్‌లో దొరికిన డ్రగ్స్‌కు వీరికి ఉన్న సంబంధాలపై కూపీలాగనున్నారు పోలీసులు.

ఈ నెల 14న చంచల్‌గూడ జైలు నుండి ఇద్దరు నిందితులు అభిషేక్, అనిల్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే కిరణ్ అనే నిర్వాహకుడు అమెరికాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కిరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అర్జున్ కల్‌కత్తాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories