Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు మండనున్న ఎండలు

Telangana: 13వ తేదీ వరకూ పెరగనున్న ఉష్ణోగ్రతలు

Jyothi
Published on: 10 April 2023 4:30 PM IST
IMD Predicts Rise Temperature 4 days in Telangana
X

Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు మండనున్న ఎండలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. 11,12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.

Jyothi

Jyothi

Next Story