Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట

Smita Sabharwal: తెలంగాణలో కాళేశ్వరం కేసుకి సంబంధించి ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 25 Sept 2025 12:29 PM IST
Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట
X

Smita Sabharwal: తెలంగాణలో కాళేశ్వరం కేసుకి సంబంధించి ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, అలాగే కమిషన్ నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ స్మితా సభర్వాల్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదికను కొట్టివేయాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు.

స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story