తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Telangana: పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 9:56 PM IST
IAS Officers Transferred in Telangana
X

తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Telangana: పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుమరం భీం జిల్లా అదనపు కలెక్టర్‌గా కె.వరుణ్‌రెడ్డిని నియమించింది. నిజామాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను, సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ్‌‌ని, కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా గరిమా అగ్రవాల్‌ను నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌గా దీపక్‌ తివారీని, మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్‌‌ను, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్‌గా అంకిత్‌ను, భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్‌గా రిజ్వాన్‌ బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story