బాబ్రీ మసీదు తీర్పుపై ఒవైసీ అసహనం

బాబ్రీ మసీదు తీర్పుపై ఒవైసీ అసహనం
x
Highlights

బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎలా తీర్పు ఇచ్చిందో అర్థం కాని విషయం అని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం...

బాబ్రీ మసీదు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు ఎలా తీర్పు ఇచ్చిందో అర్థం కాని విషయం అని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్‌ దారుస్సాలాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు తీర్పు తమకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం ఎంత వరకు సరైన నిర్ణయం?'' అని ప్రశ్నించారు.

ఈ రోజు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందరిపై అభియోగాలు కొట్టివేస్తూ తీర్పు వెలువరించడం చీకటి రోజుగా భావిస్తున్నాం. ఆరోజు బాబ్రీ మసీదు ఎవరు కూల్చివేశారు ఏమైనా మ్యాజిక్ జరిగిందా బాబ్రీ మజీద్ విషయంలో మాకు న్యాయం కావాలి'' అని ఒవైసీ డిమాండ్ చేశారు. బాబ్రీ మజీద్ అంశంపై ముస్లిం లా బోర్డు నుంచి మేము పోరాడతాం అని ఆయన అన్నారు. ఉమా భారతి, అద్వానీ బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు అనంతరం వీరు అందరూ కలిసి స్వీట్లు పంచుకుని పండుగ చేసుకుంటున్నారు. నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవన్న కోర్టు మరి బాబ్రీ మసీదు ఎవరు కూల్చేశారో తేల్చాలి? బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

సీబీఐ ఛార్జ్‌లో అనేక విషయాలు దాచి పెట్టింది. కేంద్రంలో అద్వానీ కళ్యాణ్ సింగ్‌తో ఎందుకు రాజీనామా చేయించలేదు. సీబీఐ కోర్టు తీర్పును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఇంకా బాబ్రీ మజీద్ విషయంలో సరైన న్యాయం జరగలేదు. బాబ్రీ మసీదును మేము సంరక్షించుకోలేకపోయాం. సుప్రీంకోర్టు తీర్పుపై మేమంతా ఎదురుచూస్తున్నాం. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ ఓ ముద్దాయిలా ఉన్నాడు కానీ కేంద్రం ఇతనికి సివిలైజేషన్ అవార్డు ఇచ్చింది. ఈ కేసు విషయంలో సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన ఈ తీర్పు ఫైనల్ కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories