New Year 2024: హైదరాబాద్‌లో నుమాయిష్ సందడి.. ముస్తాబవుతున్న 2వేలకు పైగా స్టాళ్లు

Hyderabad Getting Ready For New Year 2024
x

New Year 2024: హైదరాబాద్‌లో నుమాయిష్ సందడి.. ముస్తాబవుతున్న 2వేలకు పైగా స్టాళ్లు

Highlights

New Year 2024: కరోనా ఎఫెక్ట్ ఉంటుందా అని వ్యాపారుల్లో టెన్షన్

New Year 2024: హైదరాబాద్‌లో నుమాయిష్ అంటే అదొక క్రేజ్. ప్రతి ఏటా నాంపల్లి గ్రౌండ్‌లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు లక్షలాది మంది తరలి వస్తుంటారు. హ్యాండ్లూమ్ వస్త్ర డిజైన్స్, గృహోపకరణాల సామాగ్రి, పిండి వంటలు, పిల్లలకు కావాల్సిన గేమ్స్ చూపలను మంత్రముగ్ధులను చేస్తుంది. జనవరి 1నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. అందుకు ఏర్పాట్లు కూడా చకా చకా జరుగుతున్నాయి. అయితే ఈసారి నుమాయిష్ కు కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. జేఎన్ 1 కేసులు ఎక్కువగా ఉండటం, తెలంగాణలోనూ 55 కోవిడ్ వైరస్ కేసులు నమోదు కావడంతో నుమాయిష్ కు జనం వస్తారా? రారా? అన్న సందేహం నెలకొంది.

నుమాయిష్ అంటేనే లక్షలాది మంది ఒక చోట చేరి షాపింగ్ చేసుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటూ ఎంజాయ్ చేసే స్థలం. అయితే కోవిడ్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈసారి నుమాయిష్ నిర్వహణపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి రెండో వారం వరకూ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది.

దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా ఇక్కడ పేరుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి. చౌక ధరలకు దొరుకుతుండటంతో ప్రతి ఏటా జరిగే ఎగ్జిబిషన్ లో వస్తువులను కొనుగోలు చేయాలని నగరవాసులు వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికి 82 సార్లు ఎగ్జిబిషన్ నిర్వహించారంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకూ కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ను నగరంలో ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకుంటారు.

ఖరీదైన వస్తువుల నుంచి అతి స్వల్పమైన ధరలకు లభించే వస్తువులు ఇక్కడ దొరుకుతుండటంతో పేద, ధనిక తేడా లేకుండా ఎగ్జిబిషన్ కు క్యూ కడుతుంటారు. ఇక సెలవు దినాల్లో చెప్పాల్సిన పనిలేదు. మనిషి నడవాలంటే కూడా కష్టమే అవుతుంది. అందుకే శని, ఆదివారాల్లో ఎగ్జిబిషన్ రద్దీని కంట్రోల్ చేసేందుకు పోలీసుశాఖ కూడా శ్రమించాల్సి వస్తుంది. దాదాపు రెండువేలకు పైగా స్టాళ్లు అలరిస్తుండటంతో జనం కూడా అంతే స్థాయిలో వస్తుంటారు.

రాష్ట్ర నలమూల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు కాబట్టి కరోనా విజృంభించే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికి అయితే ఎగ్జిబిషన్ నిర్వహణ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కోవిడ్ అదుపులో ఉన్నంత వరకు ఎగ్జిభిషన్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇంకా కేసులు పెరిగితే మాత్రం..ఎగ్జిబిషన్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం లేకపోలేదు.

1983లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమయింది. కోవిడ్ సమయంలో 2021లో నుమాయిష్ కు సందర్శకులు రాక తగ్గడంతో పాటు ప్రభుత్వం కూడా త్వరగానే క్లోజ్ చేయించాల్సి వచ్చింది. 2019లో నుమాయిష్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి వందల సంఖ్యలో స్టాళ్లు బూడిదయ్యాయి. అయితే ఇప్పటికే భారత్ లో నాలుగువేలకు పైగానే కరోనా వైరస్ కేసులు దాటిపోయాయి. మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది. తెలంగాణలోనూ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ పై కోవిడ్ ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన అటు వ్యాపారుల్లోనూ, ఇటు నిర్వాహకుల్లోనూ కనపడుతుంది. ప్రభుత్వం కూడా ఇటువంటి జన సమర్ధం ఉన్న ప్రాంతాలలో కోవిడ్ కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతుంది. మరి ఈసారి నుమాయిష్ ఎలా జరుగుతుందన్న దానిపై అనుమానాలతో పాటు జరిగినా సందర్శకుల సంఖ్య ఆశించిన సంఖ్యలో ఉండదని కూడా అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories