కాపురానికి రావడంలేదని భార్యను కడతేర్చిన భర్త

కాపురానికి రావడంలేదని భార్యను కడతేర్చిన భర్త
x
Highlights

మహాబుబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాపురానికి రాలేదంటూ భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ కసాయి భర్త. మరిపెడకు చెందిన బానోతు కస్తూరితో ఖమ్మం...

మహాబుబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాపురానికి రాలేదంటూ భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ కసాయి భర్త. మరిపెడకు చెందిన బానోతు కస్తూరితో ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు సేవ్యకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ తగాదాలతో కొంత కాలంగా దంపతులిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కస్తూరి ఓ క్లీనిక్ లో నర్సుగా పని చేస్తూ జీవనం గడుపుతుంది. కాపురానికి రావడం లేదన్న కక్షతో పక్కా ప్లాన్ తో భార్యను హతమార్చాడు భర్త సేవ్య.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories