మంట గలిసిపోయిన మానవత్వం...చెరువు కట్ట పక్కన పసికందు

మంట గలిసిపోయిన మానవత్వం...చెరువు కట్ట పక్కన పసికందు
x
Highlights

ఓ శిశువును చెరువు కట్టవద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన నగరంలోని నాచారంలో జరిగింది

మానవత్వం మంట గలిసిపోయింది. కన్నపేగు బంధానికి కనికరం లేకుండ పోయింది. మారుతున్న కాలంతోపాటు తరిగిపోతున్న మమకారానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన.అన్యం పుణ్యం తెలియని ఓ నవజాత శిశువును చెరువు కట్టవద్ద వదిలేసి వెళ్లిపోయారు .ఈ ఘటన నగరంలోని నాచారంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాచారం జనప్రియ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా ఉన్న చెరువు కట్ట పక్కన వస్త్రంలో చుట్టి ఓ నవజాత శిశువును ఎవరో అక్కడి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఏడుపు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని నవజాత శిశువును ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన పరిసర ప్రాంతాల ప్రజలను కలిచివేసింది. ఆ చిన్నారికి వైద్యు చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories