తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Home Minister Amit Shah To Visit Telangana
x

తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Highlights

Telangana: ఈ నెల 21న మునుగోడులో అమిత్‌ షా సభ

Telangana: తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటనకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఈ నెల 21న మునుగోడులో అమిత్‌ షా సభ ఉండనుంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని అమిత్‌ షా దర్శించుకోనున్నారు. మునుగోడు నియోజకవర్గ రైతులతో సమావేశం ఏర్పాటుకు పార్టీలో చర్చిస్తున్నారు. ఇక మునుగోడులో అమిత్‌ షా సభకు 2 లక్షల మందిని తరలించాలని బీజేపీ టార్గెట్‌‌గా పెట్టుకుంది. భారీ జనసమీకరణకు జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories