
Harish Rao: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు 'X' (ట్విట్టర్) వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ కాంగ్రెస్ అరాచక వైఖరిని ఎండగట్టారు.
క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, అధికార బలం మరియు పోలీసు బలంతో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. "పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న తీరును చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటోంది. కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోంది" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్పై దాడి జరిగినప్పుడు పోలీసులు చోద్యం చూశారని, రక్షణ కల్పించాల్సింది పోయి గూండాలకు కొమ్ముకాస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాతనపల్లే కాకుండా తొర్రూరు, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ వంటి చోట్ల అడ్డదారుల్లో పీఠాలను దక్కించుకుంటున్నారని విమర్శించారు. "రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కాంగ్రెస్ కబ్జా చేస్తోంది" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత నాయకుడు బాల్క సుమన్ను భేషరతుగా విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక పారదర్శకంగా, ప్రజాస్వామిక వాతావరణంలో జరిగేలా చూడాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ను (@CEO_Telangana) ఆయన కోరారు. కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



