Harish Rao: ఇంటింటికి బూస్టర్ డోస్ ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం
Harish Rao: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా...
Harish Rao: ఇంటింటికి బూస్టర్ డోస్ ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు ఆదేశం
Harish Rao: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో రెండుకోట్లకు పైగా బూస్టర్ డోసులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు బూస్టర్ డోసు తీసుకుని కరోనా వ్యాప్తికి సహకరించాలన్నారు. దీనికనుగుణంగా అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు సైతం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హరీశ్ రావు కోరారు.
Next Story




