High Court: హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-2 అభ్యర్థులు

Group 2 Candidates Who Approached The High Court
x

High Court: హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-2 అభ్యర్థులు 

Highlights

High Court: టీఎస్‌పీఎస్సీ వద్ద కొనసాగుతున్న అభ్యర్థుల ఆందోళన

High Court: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్‌-2 అభ్యర్థులు. ఈ నెల 29, 30న జరిగే గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గురుకుల, ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్‌-2 రీ షెడ్యూల్‌ చేయాలంటూ 150 మంది గ్రూప్‌-2 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ వద్ద అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు గ్రూప్‌-2 అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories