Hyderabad: పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేత

Gold Seized at Panthangi toll plaza
x

Hyderabad: పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేత

Highlights

Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో భారీగా బంగారం పట్టుకున్నారు.

Hyderabad: హైదరాబాద్ నగర శివార్లలో భారీగా బంగారం పట్టుకున్నారు. గౌహతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఓ కారులో పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గౌహతినుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో టోల్ ప్లాజా దగ్గర కాపు కాసి సోదాలు నిర్వహించారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్‌ చేసి బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories