GRMB: ఇవాళ గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటి

GRMB: గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చ * హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 11:26 AM IST
Godavari River Management Board Meeting Today
X
గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ (ఫైల్ ఇమేజ్) 

GRMB: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ ఇవాళ జరుగనుంది. హైదరాబాద్ జలసౌధలో సమన్వయ కమిటీ మొదటి సమావేశం నిర్వహిస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, కార్యాచరణ ఖరారుపై చర్చ జరుగనుంది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీకి లేఖ రాశారు. అంతకముందు జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. సమన్వయ కమిటీ భేటీకి సంబంధిత పత్రాలతో రావాలని సూచించారు. GRMB భేటీలో గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు పాల్గొననున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story