జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి కేటీఆర్

జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి కేటీఆర్
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు...

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభం అయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు నడిచిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లుతో పాటు మరో మూడు చట్టాలను సవరణ కోసం మొత్తం నాలుగు బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. తెలంగాణ కేబినెట్ కూడా ఇటీవల ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆమోదం పొందిన బిల్లుల్లో జిహెచ్ఎంసి సవరణ బిల్లు - 2020, ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020లను ఆయా శాఖల మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఇక పోతే మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని పట్టణాలను కాంక్రింట్ జంగిల్‌గా మారకుండా హరిత పట్టణాలుగా మారుస్తామన్నారు. జీహెచ్ఎంసీ చట్టంలో మొత్తం ఐదు సవరణలు చేస్తున్నామన్నారు. హరిత హారం కోసం పదిశాతం నిధులు కేటాయిస్తున్నామన్నారు. 50 శాతం సీట్లలో మహిళలకు ప్రాతినధ్యం కల్పించేలా చట్టంలో మార్పులు చేశామన్నారు. గతంలో బడ్జెట్‌లో కేవలం 2.5 శాతం నిధులు మాత్రమే కేటాయించారన్నారు. మహిళల కమిటీ, యూత్ కమిటీ, సీనియర్ సిటిజన్స్ కమిటీల ఉంటాయన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్‌లో నాలుగు రకాల వార్డు కమిటీలో ఉంటాయన్నారు. ప్రతి కమిటీలో 25మంది ఉంటారన్నారు.

జీహెచ్ఎంసీ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తరువాత దీనిపై సభలో చర్చ మొదలయ్యింది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది ఈ రోజు జరుగుతున్న ప్రత్యేక సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క మాత్రమే హాజరయ్యారు. ఇక అసెంబ్లీకి బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్.. సమావేశాలకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్యా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories