పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న గీత మా అమ్మాయే!

పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న గీత మా అమ్మాయే!
x
Highlights

పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న మూగ, చెవిటి అమ్మాయి గీత.. తమ కూతురేనంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు ఓ దంపతులు. గీత ఎనిమిదేళ్ల వయస్సులో తప్పిపోయిందని.. మాటలు రాకపోవడంతో భారత్‌ నుంచి పాకిస్తాన్‌ వెళ్లిపోయిందని వారు అంటున్నారు.

పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు చేరుకున్న మూగ, చెవిటి అమ్మాయి గీత.. తమ కూతురేనంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు ఓ దంపతులు. గీత ఎనిమిదేళ్ల వయస్సులో తప్పిపోయిందని.. మాటలు రాకపోవడంతో భారత్‌ నుంచి పాకిస్తాన్‌ వెళ్లిపోయిందని వారు అంటున్నారు. అప్పటి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ చొరవ చూపించి పాక్‌ నుంచి స్వదేశానికి తీసుకొచ్చారని చెప్పారు. గీత అసలు పేరు సరిత అని చెబుతున్నారు కాల్వశ్రీరాంపూర్‌ మండలం తారుపల్లికి చెందిన స్వామి. గీత బాసరకు వచ్చిన విషయం సోషల్‌ మీడియాలో చూశామని.. గీతను తమకు అప్పగించాలని కలెక్టర్‌ను కోరారు. కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకయినా సిద్ధమేనని స్వామి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories