సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవదహనం.. కాసేపట్లో పరీక్షకు..

సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవదహనం.. కాసేపట్లో పరీక్షకు..
x
Highlights

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు. సిలిండర్‌ పేలడంతో తల్లి,...

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు. సిలిండర్‌ పేలడంతో తల్లి, కుమారుడు మంటల్లో సజీవదహనం అయ్యారు. అయితే రోహన్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాసేపట్లో పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తల్లి, కుమారుడి సజీవదహనంతో ఆగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్‌ గాంధీనగర్‌లో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీకయ్యింది. దీంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న వారంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories