గంజాయి ఉత్పత్తి కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. అమాయక రైతులను టార్గెట్‌ చేసిన..

గంజాయి ఉత్పత్తి కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. అమాయక రైతులను టార్గెట్‌ చేసిన..
x
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గంజాయి తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్మగ్లర్లు గంజాయిని విచ్చలవిడిగా సాగుచేస్తున్నారు....

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గంజాయి తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా మారుతోంది. జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్మగ్లర్లు గంజాయిని విచ్చలవిడిగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా బోథ్, బజరాత్నూర్, గడిహథ్నూర్ మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో నిషేధిత గంజాయిని సాగు చేస్తున్నారు. పత్తి, కందిపంటలో గంజాయిని అంతరపంటగా వేసి సాగుచేస్తున్నారు స్మగ్లర్లు.

లక్షల రూపాయలు వస్తాయని ఆశ కల్పించి అమాయక రైతులతో గంజాయిని సాగుచేయిస్తోంది మాఫియా. బోథ్‌ నియోజకవర్గంతో పాటు ఇంద్రవెల్లి, ఉట్నూరు, కెరమెరి, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్ టి, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో రైతులను టార్గెట్‌గా చేసుకుని ఎన్నో ఎకరాల్లో గంజాయి సాగుచేయిస్తోంది. దీంతో కొందరు అమాయక రైతులు గంజాయిని పత్తి పంటలో అంతర పంటగా మరికొందరు ఎవరికీ కనిపించకుండా దట్టమైన అడవుల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల సాగుచేసిన గంజాయి చేతికి అందే దశకు రాగా మరికొన్ని ప్రాంతాల్లో చివరి దశలో ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పత్తిచేనుల ‌మాదిరిగా గంజాయి వనాలున్నాయి. ఉత్పత్తి చేసిన గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, నాగ్‌పూర్, పూణె లాంటి ప్రాంతాలకు, అదేవిధంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. రైతుల నుంచి సాగుచేసిన గంజాయిని కిలోకు 5వేలు చొప్పున కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో కిలో 10వేలకు అమ్ముకొని వేలాది కోట్లు వెనకేసుకుంటోంది మాఫియా. ఉత్తర భారతంలోని యువత గంజాయికి బానిసలుగా మారడం మరోవైపు వీఐపీలు, సినిమా హీరోలు, హీరోయిన్లు గంజాయికి అలవాటుపడటం మాఫియాకు వరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories