Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గ‍డ్డం ప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

Gaddam Prasad As Speaker TS Assembly
x

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గ‍డ్డం ప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక

Highlights

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ప్రసాద్‌కుమార్‌ను స్పీకర్‌ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్‌ పదవికి ప్రసాద్‌కుమార్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం భారాసతో పాటు మజ్లిస్‌, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories