అట‌వీ శాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్యోగిపై దాడి..!

అటవీశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూప‌రింటెండెంట్ రాజుపై.. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు, అతని కుమారులు దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 3:05 PM IST
అట‌వీ శాఖ కార్యాల‌యం వ‌ద్ద ఉద్యోగిపై దాడి..!
X

అటవీశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూప‌రింటెండెంట్ రాజుపై.. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు, అతని కుమారులు దాడి చేశారు. ఈ ఘటన నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. మద్దిమడుగు ఛైర్మెన్ రాములు తనతో మాట్లాడాలని బయటికి పిలిచి.. విచక్షణారహితంగా దాడి చేశారని రాజు ఆరోపించాడు.

ఎందుకు కొడుతున్నారని అడిగినా, ఎలాంటి సమాధానం చెప్పాకుండా.. పది నిమిషాలు ఆగకుండా కొట్టి తన ఫోన్‌ ధ్వంసం చేశారని వాపోయాడు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజు పోలీసులను ఆశ్రయించాడు. కుటుంబ సమస్య కారణంగా దాడి జరిగినట్టు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story