షాకింగ్‌ : ప్రమాదంలో ప్రమాదం

షాకింగ్‌ : ప్రమాదంలో ప్రమాదం
x
Highlights

ఒకరి నిర్లక్ష్యం కుటుంబాన్ని బలి తీసుకొచ్చింది. మరొకరి అత్యుత్సహం అమాయక జనం ప్రాణాలు తీసింది. సాయం చేద్దామని వచ్చిన జనాల మీదకు డీసీఎం దూసుకుపోయింది. ఈ...

ఒకరి నిర్లక్ష్యం కుటుంబాన్ని బలి తీసుకొచ్చింది. మరొకరి అత్యుత్సహం అమాయక జనం ప్రాణాలు తీసింది. సాయం చేద్దామని వచ్చిన జనాల మీదకు డీసీఎం దూసుకుపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సిద్ధిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రమాద సహాయక చర్యలను నిర్వహిస్తున్న ప్రజలపైకి డీసీఎం దూసుకుపోయింది. దాంతో ఇద్దరు మృతి చెందారు. హుజురాబాద్‌లో నివాసం ఉండే బయ్యారం నరేందర్ రెడ్డి వైద్యసేవల కోసం తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం మధ్యా్హ్నం హైదరాబాద్‌కు కారులో బయలు దేరారు. సిద్ధిపేట శివారులోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ ‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.

అయితే కారు ప్రమాద విషయం తెలుసుకున్న సిద్ధిపేట సీఐ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న జనాలతో సహాయక చర్యలను చేపట్టారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి వేగంగా వచ్చిన DCM జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి హరీష్ రావు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories