బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్

Arun Chilukuri
Updated on: 15 Jan 2021 3:02 PM IST
FIR against Bhargav Ram and family
X

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. ఈ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్‌తో పాటు అతడి కుటుంబం మొత్తాన్ని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు పోలీసులు. భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరోవైపు అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో.. ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై శనివారం సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరగనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story