Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా

Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా
x

Adilabad: బాలికపై అత్యాచారయత్నం చేసిన దొంగబాబా

Highlights

Adilabad: స్వామీజీ అంటూ వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది.

Adilabad: స్వామీజీ అంటూ ప్రజలు ఆదరిస్తే.. వక్రబుద్ధిని చూపి ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం రాజూరలో చోటు చేసుకుంది. రాజూర సమీపంలో కొండపై శివాలయంలో ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్‌ అనే సాధువు నివాసం ఉంటున్నాడు. రెండేళ్లుగా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలోని మరో ఆలయం పక్కన ఉంటున్నాడు.

ఈ నెల 16న రాత్రి 8 గంటలకు సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక నీళ్లతో పాటు ప్రసాదాన్ని తీసుకెళ్లింది. సదరు బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు మందిరం పక్కనే ఉండే నివాసానికి తలుపులు పెట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బాలిక స్పృహ కోల్పోయి ఉంది. బాలిక ద్వారా అత్యాచారయత్నం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories