Etela Rajender: రాష్ట్ర ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితమైయ్యాయి

Etela Rajender Speech In Telangana Assembly
x

Etela Rajender: రాష్ట్ర ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితమైయ్యాయి

Highlights

Etela Rajender: దళిత బంధు పథకం పూర్తిగా ఎప్పుడు అమలవుతుందని ప్రశ్నించిన ఈటెల

Etela Rajender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రగతిని వివరించగా బీజేపీ మాత్రం అందులో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని తెలిపింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు కాగితాలకే పరిమితమైయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలపై హామీలు మాత్రమే ఇస్తుందని... వాటిని అమలు చేయడంలేదని మండిపడ్డారు. దళిత బంధు పథకం పూర్తిగా దళితులకు అందడం లేదని... ఎప్పుడు పూర్తిగా అమలవుతుందని ఈటెల ప్రశ్నించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈ బడ్జెట్‌లో అయినా ఇస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జరుగుతన్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories