Etela Rajender: రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదిగాడు.. రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నా రాలేదు..

Etela Rajender Sensational Comments On Revanth Reddy
x

Etela Rajender: రేవంత్ బ్లాక్‌మెయిల్ చేసి ఎదిగాడు.. రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నా రాలేదు..

Highlights

Etela Rajender: దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి అన్నారు.

Etela Rajender: దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాజగోపాల్‌ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినా ఆయన పార్టీలో జాయిన్ కాలేదన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్‌ రెడ్డిని ఓడించడానికి ఆనాడు టీఆర్ఎస్ చాలా చేసిందన్నారు ఈటల. రాజగోపాల్‌ రెడ్డిని ఆర్థికంగా దెబ్బకొట్టినా కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. నాడు కాంట్రాక్ట్‌ పనులు చేయించినా బిల్లులు ఇవ్వలేదన్నారు. రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నా టీఆర్ఎస్‌లోకి రాలేదన్నారు ఎమ్మెల్యే ఈటల.


Show Full Article
Print Article
Next Story
More Stories