Etela Jamuna: కరీంనగర్ జిల్లా దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ప్రచారం
Etela Jamuna: ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ * రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర సీఎంలను ఎదిరించిన వ్యక్తి ఈటల
ఈటెల జమున( ఫోటో ది హన్స్ ఇండియా )
Etela Jamuna: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉద్యమాల గడ్డ హుజూరాబాద్ అన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటల రాజేందర్ కొట్లాడాడని గుర్తు చేశారు. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి త్యాగాలతో స్వరాష్ట్రం వచ్చిందని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే టీఆర్ఎస్ కు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని తెలిపారు.
Next Story




