Telangana: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

Telangana: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 8:58 PM IST
Electricity Charges To Be Hike In Telangana
X

Telangana: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

Telangana: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. 6వేల 831కోట్ల రూపాయల ఛార్జీల పెంపునకు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వానికి టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఏఆర్‌ఆర్‌లు కూడా డిస్కంలు సమర్పించాయి. ప్రతిపాదన ప్రకారం.. గృహ వినియోగదారులపై యూనిట్‌పై 50పై., వాణిజ్య వినియోగదారులకు 1రూ. పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఈఆర్సీ Electricity Regulatory Commissionకి సమర్పించాయి డిస్కంలు. ఇక డిస్కమ్‌లకు 10వేల కోట్ల ద్రవ్యలోటు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచకతప్పదనే సంకేతాలు అందించింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story