Hyderabad: జాబ్ ఫ్రాడ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad: హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు ప్రజాపతి నిధులు బదిలీ చేసినట్లు ఆధారాలు

Shekhar G
Published on: 18 Aug 2023 11:10 AM IST
ED Registers A Case On Job Fraud Case
X

Hyderabad: జాబ్ ఫ్రాడ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad: జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఉద్యోగాల పేరుతో ప్రజాప్రతి నిరుద్యోగులను మోసం చేసినట్లు గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు నమోదు చేసింది. 720 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు.. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో లింకులు పంపి వసూలు చేసినట్లు నిర్ధారించారు. ప్రజాప్రతిపై ఇప్పటికే సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రజాపతి దుబాయ్‌లో మకాం వేసి ఇండియాలో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. హవాలా రూపంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు బదలాయిస్తున్నట్లు.. ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు ప్రజాపతి నిధులు బదిలీ చేసినట్లు ఆధారాలు సేకరించారు.

Shekhar G

Shekhar G

Next Story