వివాహబంధంతో ఏకమైన మరుగుజ్జు జంట

Arun Chilukuri
Published on: 19 Dec 2020 5:09 PM IST
వివాహబంధంతో ఏకమైన మరుగుజ్జు జంట
X

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం వైభవంగా జరిగింది. మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ తో పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వప్న వివాహ వేడుక వైభవంగా సాగింది. మెట్‌పల్లి మండలం ఆరాపేట శివాలయంలో వేదమంత్రోత్సవాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరువురికి చెందిన బంధుమిత్రులు హాజరయ్యారు. మెట్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సహా పలువురు ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story