దుబ్బాక ఉపఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే!

దుబ్బాక ఉపఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే!
x
Highlights

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు...

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు ప్రచారపర్వంలో మునిగిపోయారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే నామినేషన్లు వేసిన వారిలో ఇప్పటివరకు 46 దాఖలు కాగా, వారిలో 11 మంది ఉపసంహరించుకున్నారు. 34 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టైంది. మరో 12 నామినేషన్లు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. కాగా మొత్తంలో ప్రస్తుతం 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు.

ఇక పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న వారి జాబితాలోకి వెళితే టీఆర్‌ఎస్‌ పార్టీ- సోలిపేట సుజాత, శ్రమజీవిపార్టీ- జాజుల భాస్కర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా- సుకురి అశోక్, కాంగ్రెస్‌ పార్టీ- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్- కత్తి కార్తీక, బీజేపీ- రఘు నందన్ రావు, ఇండియా ప్రజా బంద్ పార్టీ- సునీల్, జై స్వరాజ్- గౌట్ మల్లేశం ఉన్నారు.

స్వతంత్ర అభ్యర్ధులు జాబితాలో అండర్ఫ్ సుదర్శన్, బుట్టన్నగారి మాధవ రెడ్డి, కొట్టాల యాదగిరి ముదిరాజ్, అన్న బుర్ర రవి తేజ గౌడ్, కోట శ్యామ్ కుమార్‌, అన్న రాజ్, విక్రమ్ రెడ్డి వేముల, కంటే సాయన్న, పీఎం .బాబు, బండారు నాగరాజ్, మోతె నరేష్, వడ్ల మాధవాచారి, రణవేని లక్ష్మణ్‌ రావు, సిల్వెరి శ్రీకాంత్, రేపల్లె శ్రీనివాస్ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories