విపక్షాలకు బూస్టింగ్‌ ఇస్తోన్న దుబ్బాక ఫలితాలు

Arun Chilukuri
Published on: 12 Nov 2020 1:32 PM IST
విపక్షాలకు బూస్టింగ్‌ ఇస్తోన్న దుబ్బాక ఫలితాలు
X

టీఆర్ఎస్ కోట దుబ్బాకలో కమల వికాసం కాషాయ దళంతో పాటు ఇతర పార్టీల్లోనూ భరోసా నింపింది. ఇన్నాళ్లూ నిరాశలో ఉన్న చిన్న పార్టీలు సైతం బీజేపీ విజయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగేందుకు అడుగులు వేస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమకు కూడా కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు విపక్ష నేతలు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అందుకు తగిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో వరదలు, ప్రజల ఇబ్బందులను ఎజెండాగా మలుచుకోవాలని టీడీపీ, టీజేఎస్‌ భావిస్తున్నాయి. వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story