క్వార్టర్ ఇస్తే కరెంట్ పోల్ దిగుతా.. లేదంటే వైర్ తాకి చస్తా..మందుబాబు హల్‌చల్

క్వార్టర్ ఇస్తే కరెంట్ పోల్ దిగుతా.. లేదంటే వైర్ తాకి చస్తా..మందుబాబు హల్‌చల్
x
క్వార్టర్ ఇస్తే దిగుతా.. లేదంటే కరెంట్ వైర్ తాకి చస్తా
Highlights

ఓ మందుబాబు వినూత్న ఆలోచన చేశాడు. క్వార్టర్ కోసం ఆ ప్రాంతంలోని ప్రజలు, పోలీసులను ఆందోళనకు గురిచేశాడు.

ఓ మందుబాబు వినూత్న ఆలోచన చేశాడు. ఆ ప్రాంతంలోని ప్రజలు, పోలీసులను ఆందోళనకు గురిచేశాడు. మధ్యపానం సేవించడం డబ్బులేకపోవడంతో కరెంట్ స్థంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ ఘటన నగరంలోని సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రి సమీపంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ప్రాతంలో ఇలియాస్ అనే వ్యక్తి కరెంటు పోల్ ఎక్కి దిగిరానని మొండికేశాడు. మందు బాటిల్ ఇప్పిస్తే కిందికి దిగుతానని డిమాండ్ చేశాడు.

కాగా.. కరెంట్ పోల్ ఎక్కిన అతన్ని చూసి స్థానికులంతా అక్కడ గుమిగూడారు. దిగిరావాలని వారు చెప్పారు. అయితే ఇలియాస్ మాత్రం బాటిల్ ఇవ్వకుంటే పక్కనే ఉన్న హైటెన్షన్ వైరు తాకుతానని అందర్నీ భయాందళలను గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటన స్థలనాకి చేరుకున్నారు. పోలీసులు కూడా కిందికి దిగాలని బతిమాలినా మందుబాబు వినలేదు.

30 అడుగులకు కరెంటు స్తంభం ఎక్కిన ఇలియాస్ భీష్మించుకు కూర్చున్నాడు. 30 అడుగులను నుంచి పడిపోయినా, అతన్ కరెట్ వైర్ తాకినా చనిపోతాడని భావించిన పోలీసులు కింద పరదాలను అడ్డు పెట్టారు. అతను కింద పడినా... గాయాలు కాకుండా ఉండేందుకు ‎విశాలమైన ప్లాస్టిక్ పరదాలను స్థానికులు పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు ఎంత బతిమాలినా.. మందుబాబు ఎంతకీ కిందికి దిగిరాకపోవడంతో... దగ్గర్లోని వైన్స్ షాపులో ఒక క్వార్టర్ బాటిల్ కొని తీసుకొచ్చారు. దాంతోపాటు గ్లాసులు, వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇలియాస్‌కు చూపించారు. దీంతో అతను అప్పుడు శాంతించాడు. తాను స్తంభం దిగి వస్తానని, తనని ఏమీ అనకూడదని షరతు విధించాడు. దానికి పోలీసులు సరే అని చెప్పడంతో ఇలియాస్ కిందికి దిగాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories