Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..

Keesara: మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలో దొడ్ల మిల్క్ మేనేజర్ పై తల్వార్ తో దాడి చేశారు.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 11:16 AM IST
Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..
X

Keesara: పాల వ్యాపారిపై తల్వార్ తో దాడి.. పరిస్థితి విషమం..

Keesara: మేడ్చల్ జిల్లా కీసర ప్రధాన కూడలిలో దొడ్ల మిల్క్ మేనేజర్ పై తల్వార్ తో దాడి చేశారు. ఉదయం కీసరకు కారులో బయల్దేరిన శ్రీనివాస్ ను మార్కెట్ సమీపంలో పాల వ్యాపారి కిరణ్ తల్వార్ తో బలంగా దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. పాల వ్యాపారి కిరణ్ దొడ్ల కంపెంనీకి బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఇదే విషయంపై పలుమార్లు బకాయిలు చెల్లించాలంటూ కిరణ్ పై శ్రీనివాస్ వత్తిడి చేశాడు. ఇద్దరు మద్య వాగ్వాదం జరుగుతూ వచ్చింది. బకాయిల విషయంపై మరోసారి శ్రీనివాస్ నిలదీయడంతో కిరణ్ అతికిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను స్థానికులు సమీపంలోని ప్రేవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story