సాంకేతికతపై పట్టుసాధిస్తున్న ఉపాధ్యాయులు

సాంకేతికతపై పట్టుసాధిస్తున్న ఉపాధ్యాయులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Digital training : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడో ప్రారంభం కావల్సిన పాఠశాలలు, కళాశాలలు ఇప్పటి వరకు తెరవకుండా అలాగే మూసివేసి ఉన్నాయి....

Digital training : కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడో ప్రారంభం కావల్సిన పాఠశాలలు, కళాశాలలు ఇప్పటి వరకు తెరవకుండా అలాగే మూసివేసి ఉన్నాయి. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితమయి ఉండడంతో ఇప్పటికు ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కొన్ని నెలలు వృథా అయ్యాయి. ఇదే పరిస్తితి కొనసాగితే ఈ ఏడాది విద్యార్థులు నష్టపోక తప్పదు. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు విద్యాబోధనను కొనసాగించేందుకు డిజిటల్‌ బోధన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ టీచర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. టెక్నాలజీ సాయంతో వివిధ పాఠ్యాంశాలను విద్యార్థులకు ఏవిధంగా బోధించాలన్న అంశంపై జూమ్‌యాప్‌ ద్వారా ఐదు రోజులుగా రోజుకు రెండు గంటలపాటు శిక్షణ ఇస్తున్నది. ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులను ఎంపికచేసి వారి ద్వారా మిగతా ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తున్నది. ఇక విద్యాశాఖ అందిస్తున్న ఈ ఆన్‌లైన్‌ శిక్షణకు ఎంతమంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారనే విషయమై క్లస్టర్‌ రిపోర్స్‌పర్సన్లు నిఘా పెడుతున్నారు.

ఇక పోతే ప్రస్తతం రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం కలిపి 26,725 ఉన్నాయి. కాగా ఈ పాఠశాలల్లో 22 లక్షల మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంత మందికి విద్యను అందించడానికి గాను 1,34,191 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 475 కేజీబీవీల్లో 1,00,211 మంది విద్యార్ధులు ఉన్నారు. 258 ఎయిడెడ్‌ పాఠశాలలకుగాను 53,524 మంది చదువుతున్నారు. 194 ఆదర్శ పాఠశాలలు ఉండగా ఇందులో 1,26,612 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 4,658 ఉండగా ఇందులో 8,89,001 విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడిచే ఉన్నత పాఠశాలలు 5,585 ఉండగా వీటిలో 11,69,348 మంది విద్యార్థులున్నారు.

రాష్ట్రంలో ఉన్న ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా శిక్షణను ఇస్తున్నారు. అందులో మొదట గణితం ఉపాధ్యాయులకు వేదిక్‌ గణితంపై రిసోర్సుపర్సన్ల ద్వారా ఐదు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంతోపాటుగా 'లర్నింగ్‌ అవుట్‌ కమ్‌'పై టీచర్లకు శిక్షణ ఇస్తున్నది. టీశాట్‌-దూరదర్శన్‌ వంటి చానళ్లు, ఎస్సీఈఆర్టీ యూ ట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా బోధించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తున్నది. దీనికోసం ఉపాధ్యాయులు ఆయా గ్రామాల్లోని సాంకేతిక అంశాలను వాడుకోవాల్సి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు 40 నిమిషాలపాటు పాఠాలను బోధించిన తరువాత ఆ విషయాలు విద్యార్థులకు ఏ మేరకు అర్థమయ్యాయో తెలుసుకునే విధానంపై రిసోర్సు పర్సన్లు ఉపాధ్యాయులకు చెప్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories